వారు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-05-09T20:09:43+05:30 IST
కరోనా కట్టడి చేయలేక తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి: కరోనా కట్టడి చేయలేక తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి ప్రతిపక్షంపై కక్షసాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అన్యాయాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని చెప్పారు. కొంతమంది వైసీపీ యూనిఫాం పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్రెడ్డితో పాటు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రతి తప్పుడు కేసుకు మూల్యం చెల్లించక తప్పదని లోకేష్ తెలిపారు.