వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: నారా లోకేష్
ABN , First Publish Date - 2022-04-30T21:38:20+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్రెడ్డిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్రెడ్డిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ వైసీపీ పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే తాడేపల్లి ప్యాలస్లో ఎలా నిద్రపడుతుంది జగన్ రెడ్డి గారు? విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన జరిగినా స్పందించలేనంతగా ఏం వెలగబెడుతున్నారు?విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనపల్లి సమీపంలో యువతిని అత్యాచారం చెయ్యడంతో పాటు గుర్తు పట్టలేనంతగా పెట్రోల్ పోసి తగలబెట్టారు.ఎక్కడ గన్? ఎక్కడ జగన్? ఇప్పటికైనా మేల్కొని మహిళలకు రక్షణ కల్పించండి. యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని నడి రోడ్డుపై ఉరి తీసి మహిళల భద్రతకి భరోసా ఇవ్వాలి’’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.