పిల్లల మరణాలు జగన్ సర్కారు హత్యలే: నారా లోకేశ్
ABN , First Publish Date - 2021-12-06T03:21:37+05:30 IST
పిల్లల మరణాలు జగన్ సర్కారు హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో...
అమరావతి: పిల్లల మరణాలు జగన్ సర్కారు హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో అంతు చిక్కనివ్యాధితో నలుగురి మృతి చెందగా 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇందుకు కారణం జగన్ సర్కారేనని లోకేశ్ మండిపడ్డారు. నెలరోజులుగా పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందా? అని ప్రశ్నించారు. పిల్లల బాగుకోరేవాడు మేనమామ అవుతాడని...ప్రాణాలు తీసేవాడు కాదని లోకేశ్ ఎద్దేవా చేశారు.