విద్యుత్, ఉల్లి ధరలు తగ్గించలేదు కానీ..: లోకేష్
ABN , First Publish Date - 2020-02-20T00:38:22+05:30 IST
అమరావతి: రాజధానిలో భూములను పంపిణీ చేయడం సరికాదని...
అమరావతి: రాజధానిలో భూములను పంపిణీ చేయడం సరికాదని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం మంగళగిరిలో లోకేష్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్యయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని అభివృద్ధి కోసం రైతులు భూములు ఇచ్చారని.. రైతులకు న్యాయం చేసిన తర్వాతే రాజధాని భూముల జోలికి వెళ్లాలన్నారు. భూసేకరణ చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. విద్యుత్, ఉల్లి ధరలు తగ్గించలేదు కానీ..తమ భద్రత తగ్గించారని ఎద్దేవా చేశారు. మూడు ముక్కల రాజధానిపై సెలక్ట్ కమిటీ నివేదిక ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మండలి చైర్మన్ చెప్పిన దానికి కార్యదర్శి అడ్డు చెప్పడమేంటని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.