డీజీపీ తీరుపై నారా లోకేష్ ఫైర్

ABN , First Publish Date - 2021-01-16T02:38:50+05:30 IST

డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తీరుపై ట్విట్టర్‌లో టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ‘‘విగ్రహాలు ధ్వసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పారు.

డీజీపీ తీరుపై నారా లోకేష్ ఫైర్

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌ తీరుపై ట్విట్టర్‌లో టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ‘‘విగ్రహాలు ధ్వసం చేసింది దొంగలు, పిచ్చోళ్లని నిన్న చెప్పారు. నేడు రాజకీయం కోణం వైపు మాట ఎందుకు తిరిగింది?. తాడేపల్లిలో జగన్ మార్క్ బోగిపళ్లేమైన మీకు పోశారా?. ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన దామోదర్‌రెడ్డి పేరు జాబితాలో ఎందుకు లేదు?. నిందితులను పట్టుకోవడం చేతకాక చేవచచ్చిన మీపై ముందు కేసులు పెట్టాలి. తప్పుడు సమాచారంతో ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందుకు.. కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలి’’ అని ట్విట్టర్‌లో లోకేష్‌ కోరారు.

Updated Date - 2021-01-16T02:38:50+05:30 IST