జగన్ భూ దాహానికి దళితులు బలౌవుతున్నారు: నారా లోకేష్

ABN , First Publish Date - 2020-08-13T19:00:33+05:30 IST

అమరావతి: జగన్ రెడ్డి భూ దాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

జగన్ భూ దాహానికి దళితులు బలౌవుతున్నారు: నారా లోకేష్

అమరావతి: జగన్ రెడ్డి భూ దాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం  పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. 


ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారన్నారు. గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైసీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడన్నారు. అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయ్యాలన్నారు. డబ్బా బాబ్లీని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేష్ పేర్కొన్నారు.


Updated Date - 2020-08-13T19:00:33+05:30 IST