హైదరాబాద్ : తెలుగుదనం-దళిత కలం-హక్కుల గళం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి తెలుగు భాష, సాహిత్య రంగాలకి తీరనిలోటుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠాలతో విద్యార్థులను, రచనలతో సమాజాన్ని చైతన్యం చేసి అణగారిన దళితులకు అండగా ఎండ్లూరి సుధాకర్ నిలిచారన్నారు. ఆయన కుటుంబసభ్యులకి నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.