అయ్యన్నను ఎదుర్కోలేక సీఎం పోలీసులను పంపిస్తున్నారు: లోకేష్‌

ABN , First Publish Date - 2022-02-24T21:39:45+05:30 IST

ఏపీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని నారా లోకేష్ విమర్శించారు.

అయ్యన్నను ఎదుర్కోలేక సీఎం పోలీసులను పంపిస్తున్నారు: లోకేష్‌

విశాఖ:  ఏపీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నను ఎదుర్కోలేక సీఎం జగన్ పోలీసులను పంపిస్తున్నారని అన్నారు. ఇక్కడ పోలీసుల మోహరింపు, నిర్బంధం చూస్తుంటే నర్సీపట్నంలో ఉన్నామా?.. ఉక్రెయిన్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. టీడీపీ నేతలపై ఇప్పటి వరకు 3,250 కేసులు పెట్టారన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని లోకేష్‌ హెచ్చరించారు.


కాగా అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. సీఎం జగన్‌ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయ్యన్నపాత్రుడి ఇంటికి వచ్చిన నల్లజర్ల పోలీసులు నోటీసులంటించారు. బుధవారం రాత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల చర్యలపై  అయ్యన్నపాత్రుడి తరపు న్యాయవాది సతీష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయ్యన్నపై నమోదైన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-02-24T21:39:45+05:30 IST