వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ ఫైర్
ABN , First Publish Date - 2021-11-08T16:16:23+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అన్నారని, ఇప్పుడు వైసీపీ పాలనలో అవే ధరలు తెలుసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లేందుకు తాము సిద్ధమని, సీఎం జగన్ సిద్ధమా? అంటూ లోకేష్ సవాల్ చేశారు.