రేపటి బంద్కు టీడీపీ పూర్తి మద్దతు ఉంటుంది: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-03-04T19:17:50+05:30 IST
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న కార్మికులకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు.
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న కార్మికులకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. రేపు జరిగే బంద్కు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని నారా లోకేష్ పేర్కొన్నారు.