ఒంటరి మహిళ హోటల్ను కబ్జా చేసేందుకు వైసీపీ నేత యత్నం: లోకేష్
ABN , First Publish Date - 2020-11-25T20:51:56+05:30 IST
జగన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ఆత్మహత్యలప్రదేశ్గా మార్చారని లోకేష్ విమర్శించారు.
అమరావతి: జగన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ఆత్మహత్యలప్రదేశ్గా మార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో సామాన్యులకు రక్షణ లేదన్నారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని విమర్శించారు. వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గం సాతులూరులో.. ఒంటరి మహిళ హోటల్ను కబ్జా చేసేందుకు వైసీపీ నేత యత్నించారని, దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానందని అన్నారు. హోటల్ కబ్జాకు యత్నించిన వైసీపీ నేతను కఠినంగా శిక్షించాలని ఒంటరి మహిళకు న్యాయం చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.