ఏపీలో జే-టాక్స్ టెర్రరిజం: లోకేష్

ABN , First Publish Date - 2021-04-13T21:42:20+05:30 IST

ఏపీలో ద్రవ్యోల్భణం పెరుగుదలపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో జే-టాక్స్ టెర్రరిజం: లోకేష్

అమరావతి: ఏపీలో ద్రవ్యోల్భణం పెరుగుదలపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జే టాక్స్ టెర్రరిజం కొనసాగుతోందని, ప్రజల జేబులకు చిల్లులు వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన తాజా నివేదికలో మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్బనం అధికంగా నమోదయిందని లోకేష్ ప్రస్తావించారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌పై ఆ నివేదికను పోస్టు చేశారు.

Updated Date - 2021-04-13T21:42:20+05:30 IST