నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2022-01-24T05:46:26+05:30 IST
కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కర్నూలు(అగ్రికల్చర్), జనవరి 23: కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు లోక్సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్, నాగేంద్ర కుమార్తో పాటు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. బాణాసంచా కాల్చారు. నారా లోకేష్ సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని, టీడీపీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని అందించి ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ లోకేష్ మచ్చలేని నాయకుడిగా నిలిచారన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, కార్పొరేటర్ పరమేష్, చంద్రకళాబాయి, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, నరసింహులు, ఎల్లప్ప, బజారన్న, అహ్మద్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని టీడీపీ కార్యాలయంలో నందవరం మండల కన్వీనర్ డీవీ రాముడు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు అదివారం వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదగా కేక్ కట్ చేయించారు. మాజీ సర్పంచ్ కాశీంవలీ, దర్మాపురం గోపాల్, పెద్దవలీ, నయామ్ రహిమాన్, సద్దాం, హూసేన్, రంజాన్, ఖాదర్, చిన్న అనుమంతు పాల్గొన్నారు.
డోన్/బేతంచెర్ల: డోన్ పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి నివాసంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అంధుల కాలనీలో అంధులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. యువ నాయకుడు మన్నె గౌతమ్ రెడ్డి, టీడీపీ డోన్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, బేతంచెర్ల మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు కుమ్మరి సుధాకర్, మాజీ కౌన్సిలర్ గోపాల్, బేతంచెర్ల నాయకులు రామనాథం, తిరుమలేష్ చౌదరి, ఉన్నం శేఖర్, షేక్షావలి, బీమారెడ్డి, శ్రీధర్, రూబెన్, మేకల నాగరాజు, పీవీ రమణ, నాగేశ్వర్ రెడ్డి, రామ్మూర్తి, యోగేంద్రబాబు, నంద్యాల మధు, శివకుమార్, విజయకుమార్, పాల్గొన్నారు.
కల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గౌరు నివాసంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకలకు నంద్యాల పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ పాణ్యం ఇన్చార్జి గౌరు చరిత ముఖ్య అతిథులుగా హాజరై కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వాన్ని పెంపొందించాలన్నదే లోకేష్ సంకల్పం అన్నారు. అనంతరం గౌరు దంపతులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, క్యాతూర్ మధు, గంగాధర్గౌడు, దొడ్డిపాడు భాషా, ఫిరోజ్, శివ, బజారన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.