నా తల్లిని అన్నవారిని వదిలిపెట్టను: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2021-12-22T21:20:19+05:30 IST

‘నా తల్లిని విమర్శించడం బాధించింది. నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టం’’ అని టీడీపీ నేత నారా లోకేశ్‌ హెచ్చరించారు.

నా తల్లిని అన్నవారిని వదిలిపెట్టను: నారా లోకేశ్‌

గుంటూరు: ‘‘నా తల్లిని విమర్శించడం బాధించింది. నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టం’’ అని టీడీపీ నేత నారా లోకేశ్‌ హెచ్చరించారు. ఈ రోజు మంగళగిరిలో లోకేశ్‌ పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిడమర్రు రోడ్డులో డంపింగ్‌ యార్డును ఆయన పరిశీలించారు. డంపింగ్‌ యార్డు మారుస్తామని చెప్పి ఎమ్మెల్యే మాట తప్పారని దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని నారా లోకేశ్‌ హెచ్చరించారు.


లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నిలదీస్తున్నారు. వారానికోసారి వచ్చి ఫొటోలు దిగి జంప్ అయిపోతున్నారని ఎద్దేవాచేశారు. సీఎం ఉంటున్న నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కులేదని తప్పుబట్టారు. చెత్త సీఎంల జాబితాలో దేశంలోనే జగన్‌రెడ్డి నెంబర్ వన్ అని లోకేష్‌ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-22T21:20:19+05:30 IST