వివాహ వేడుకలో నారా లోకేష్
ABN , First Publish Date - 2021-10-26T04:26:17+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
మొయినాబాద్ రూరల్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం మొయినాబాద్ మండలంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. హిమాయత్నగర్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యాసంస్థల మాజీ సీఈవో మోహన్రావు కుమార్తె భావన ఎల్ల పెళ్లి తమిళనాడుకు చెందిన అశ్విన్శరణ్తో బాకారం పరిధిలోని ఓ రిసార్టులో సోమవారం జరిగింది. ఈ వేడుకకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకలో ఆయన సందడి చేశారు. పెళ్లికి వచ్చిన పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఈ వివాహానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థల సీఈవో ప్రసాద్రావు, నాయకులు ముదిగొండ రవియాదవ్, విద్యాసంస్థల ఏవో సురేష్ పాల్గొన్నారు.