వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు?: లోకేష్

ABN , First Publish Date - 2021-11-05T00:49:22+05:30 IST

వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు?, పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడు? అని టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు.

వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు?: లోకేష్

అమరావతి: వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు?, పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడు? అని టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 తగ్గించాయన్నారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గించాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.07, డీజిల్‌పై రూ.11.75 తగ్గించిందని లోకేష్ పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించడానికి నిర్ణయించిందన్నారు. వసూల్‌రెడ్డికి మాత్రం పన్నుల భారం తగ్గించడానికి మనసు రావడంలేదని చెప్పారు. పన్నుల బాదుడుతో జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయని వ్యాఖ్యానించారు. దేశమంతా పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో ప్రజలపై వసూల్‌రెడ్డి కరుణ చూపాలన్నారు. 

Updated Date - 2021-11-05T00:49:22+05:30 IST