మహిళని వివస్త్రని చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది: లోకేష్

ABN , First Publish Date - 2022-03-08T23:30:49+05:30 IST

మహిళని వివస్త్రని చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది: లోకేష్

మహిళని వివస్త్రని చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది: లోకేష్

అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా మహిళల పట్ల వైసీపీ అరాచకం కొనసాగడం ఏపీలో దుస్థితికి అద్దం పడుతోందని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకి భద్రత కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నేతల కోసం దుశ్శాసనపర్వం సాగించడం తీవ్ర విచారకరమన్నారు. నెల్లూరు జిల్లా పెద్దఅన్నలూరులో వైసీపీ నేత అక్రమ లేఅవుట్‌ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులపై దాడిచేసిన పోలీసులు మహిళ చీరలాగేసిన దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ తగాదాలో పోలీసులు జోక్యం చేసుకోవడమే తప్పన్నారు. వైసీపీ నేత అక్రమ లే అవుట్ కోసం మహిళని వివస్త్రని చేయడం సభ్యసమాజం తలదించుకునేలా చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకంఠం భూములు అక్రమించిన వైసీపీ నేతపై కేసు నమోదు చేయాలన్నారు. 


Updated Date - 2022-03-08T23:30:49+05:30 IST