వంగపండు మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయింది: లోకేష్

ABN , First Publish Date - 2020-08-04T15:40:51+05:30 IST

వంగపండు మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయింది: లోకేష్

వంగపండు మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయింది: లోకేష్

అమరావతి: ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కళ ప్రజల కోసం అంటూ చివరి శ్వాస వరకూ గొంతెత్తి వందల జానపదాలకు గజ్జెకట్టారన్నారు. వంగపండు ప్రసాదరావు మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల లోకేష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2020-08-04T15:40:51+05:30 IST