లోకేష్‌ పర్యటన రేపు

ABN , First Publish Date - 2020-10-25T09:56:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ ఈనెల 26వ తేదీన కైకలూరు మండలంలో పర్యటించనున్నారని ఏలూరు..

లోకేష్‌ పర్యటన రేపు

కైకలూరు, అక్టోబరు24 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌  ఈనెల 26వ తేదీన కైకలూరు మండలంలో పర్యటించనున్నారని ఏలూరు పార్లమెంట్‌ తెలుగుదేశంపార్టీ టీడీపీ ఇన్‌చార్జ్‌ గన్నివీరాంజనేయులు తెలిపారు.  సోమవారం ఉదయం 7గంటలకు ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి కైకలూరు, కొల్లేరు గ్రామాల్లో ముంపును పరిశీలన చేస్తారు. అనంతరం ఉప్పుటేరు మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళతారని తెలిపారు. ఈకార్యక్రమానికి టీడీపీ నాయకులు, అభిమానులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-25T09:56:23+05:30 IST