నేడు తిరుపతికి Nara Bhuvaneswari

ABN , First Publish Date - 2021-12-20T12:56:27+05:30 IST

ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సోమవారం తిరుపతికి రానున్నారు...

నేడు తిరుపతికి Nara Bhuvaneswari

  • వరద బాధితులకు రూ.48లక్షల వితరణ


తిరుపతి : ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేడు (సోమవారం) తిరుపతికి రానున్నారు. చిత్తూరు,నెల్లూరు,కడప జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 48మంది కుటుంబాలకు   లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలోని రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున బాధితులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-20T12:56:27+05:30 IST