నాని, వంశీ పథకం ప్రకారం రాధాను సభకు తీసుకెళ్లారు: బుద్దా

ABN , First Publish Date - 2022-01-03T23:31:46+05:30 IST

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కలిశారు. రెక్కీ ఘటన వివరాలను రాధాను నేతలు అడిగి తెలుసుకున్నారు.

నాని, వంశీ పథకం ప్రకారం రాధాను సభకు తీసుకెళ్లారు: బుద్దా

అమరావతి: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కలిశారు. రెక్కీ ఘటన వివరాలను రాధాను నేతలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ పథకం ప్రకారం రాధాను సభకు తీసుకెళ్లారని ఆరోపించారు. రాధాను పావుగా వాడుతూ వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. రెక్కీ జరగలేదని నగర సీపీ చెప్పడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాధా ఇంటిపై రెక్కీ చేశారన్నా ఇంతవరకు పోలీసులు ఏమీ తేల్చలేదని, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని టీడీపీ నేత నాగుల్ మీరా డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-03T23:31:46+05:30 IST