బండారు సత్యనారాయణకు భయం పట్టుకుంది: పేర్ని నాని
ABN , First Publish Date - 2022-06-08T22:20:51+05:30 IST
ప్రభుత్వ పధకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్ళడం గడపగడప కార్యక్రమ లక్ష్యమని మాజీమంత్రి పేర్ని నాని ప్రకటించారు.
అమరావతి: ప్రభుత్వ పధకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్ళడం గడపగడప కార్యక్రమ లక్ష్యమని మాజీమంత్రి పేర్ని నాని ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ధానికంగా ఉండే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారిస్తున్నామని తెలిపారు. సచివాలయ పరిధిలోని అన్ని ఇళ్ళకూ మూడు రోజుల్లో వెళుతున్నామన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల పనితీరు పరిశీలిస్తామని తెలిపారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణకు భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. దొడ్డి దారిన వచ్చిన ప్రజాప్రతినిధులకే భయం పట్టుకుందని పేర్ని నాని అన్నారు.