నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు వాయిదా

ABN , First Publish Date - 2020-11-28T19:11:44+05:30 IST

నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు వాయిదా పడింది.

నంద్యాల అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు వాయిదా

కర్నూలు: నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు వాయిదా పడింది. శనివారం  ఈ కేసుకు సంబంధించి మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి.  వాద, ప్రతివాదనలు విన్న కోర్టు  జడ్జిమెంట్ కోసం  ఈనెల30(సోమవారం)కు వాయిదా వేసింది.


తమను పోలీసులు వేధిస్తున్నారంటూ సలాం అనే వ్యక్తి ఈనెల 3న తన కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు సలాం కుటుంబంతో తీసుకున్న ఓ సెల్పీ వీడియో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నామని అబ్దుల్‌, ఆయన భార్య నూర్జహాన్ అన్నారు.

Updated Date - 2020-11-28T19:11:44+05:30 IST