నంద్యాల జూ.జడ్జిగా కేశంపేట వాసి
ABN , First Publish Date - 2022-08-12T05:23:13+05:30 IST
నంద్యాల జూ.జడ్జిగా కేశంపేట వాసి
కేశంపేట, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జూనియర్ సివిల్ జడ్జిగా కేశంపేట మండల వాసి బాధ్యత లు స్వీకరించనున్నారు. లింగంధనకు చెందిన జడ్జి గుబ్బ ప్రభాకర్, విజయనిర్మల దంపతుల కుమార్తె అర్చన ఇటీవల ఏపీలో నిర్వహించిన జ్యుడీషియల్ పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించారు. కౌల్సింగ్లో అర్చన నంద్యాల జూనియర్ సివిల్ జడ్జిగా నియామకమయ్యారు. ఆగస్టు 17న జడ్జిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. అర్చన జడ్జిగా ఎంపికవడం పట్ల ఎంపీపీ రవీందర్, నాయకులు వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, మధుసూదన్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.