కోల్‌కతా నుంచి నంద్యాల మీదుగా వాస్కోడిగామాకు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2021-04-17T05:15:23+05:30 IST

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని నంద్యాల మీదుగా కోల్‌కతా నుంచి వాస్కోడిగామా (గోవా)కు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం పేర్కొన్నారు.

కోల్‌కతా నుంచి నంద్యాల మీదుగా వాస్కోడిగామాకు ప్రత్యేక రైలు

నంద్యాల(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 16: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని నంద్యాల మీదుగా కోల్‌కతా నుంచి వాస్కోడిగామా (గోవా)కు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. వారానికి 4 రోజులు తిరిగే 08047 నంబరు గల ప్రత్యేక రైలు సోమ, మంగళ, గురు, శనివారాలలో కోల్‌కతా నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి బుధ, గురు, శని, సోమవారాలలో తెల్లవారు జామున ఒంటి గంటకు నంద్యాలకు చేరుకొని అదే రోజు మధ్యాహ్నం 3.45 నిమిషాలకు గోవాకు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. 08048 నంబరు గల ప్రత్యేక రైలు మరుసటి దినం ఉదయం 6.30 నిమిషాలకు గోవా నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 8.20 నిమిషాలకు నంద్యాలకు చేరుకొని కలకత్తాకు బయలు దేరుతుందని చెప్పారు. ఈనెల 17వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ప్రత్యేక రైలు రాకపోకలు నంద్యాల మీదుగా సాగుతుందని అన్నారు. 

Updated Date - 2021-04-17T05:15:23+05:30 IST