అశ్రునయనాల నడుమ నందివాడ బాబు అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-02-28T07:04:22+05:30 IST
గుడివాడ వీకేఆర్ వీఎన్బీ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాల కమిటీ కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు (నందివాడ బాబు) అంత్యక్రియలు శనివారం అశ్రున యనాల నడుమ నందివాడలో నిర్వహిం చారు.
నందివాడరూరల్(గుడివాడ), ఫిబ్రవరి 27 : గుడివాడ వీకేఆర్ వీఎన్బీ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాల కమిటీ కార్యదర్శి వేములపల్లి వెంకటేశ్వరరావు (నందివాడ బాబు) అంత్యక్రియలు శనివారం అశ్రున యనాల నడుమ నందివాడలో నిర్వహిం చారు. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, కఠారి ఈశ్వర్కుమార్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బాబు మృతి టీడీపీకి తీరని లోటని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యారంగం అభివృద్ధిలో నందివాడ బాబు గణనీయమైన పాత్ర పోషించారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నందివాడ బాబుతో ఉన్న అనుబంధాన్ని మాజీ మంత్రి పిన్నమనేని గుర్తు చేసుకున్నారు.