నందిగామలో భారీగా మోహరించిన పోలీసులు
ABN , First Publish Date - 2022-06-20T14:31:43+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులు భారీగా మోహరించారు. మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు..
విజయవాడ : ఎన్టీఆర్(NTR) జిల్లా నందిగామ(Nandigama)లో పోలీసులు భారీగా మోహరించారు. మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ(Nupur Sharma) చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ముస్లింల నిరసన సభ ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్లో ముస్లింలు నిరసన చేపట్టనున్న నేపథ్యంలో 60 మంది పోలీసులు, 9 మంది ఎస్ఐలు, ఇద్దరు సీఐలు, ఏసీపీ అధికారి, 30 మంది సీఆర్పీఎఫ్ బృందం బందోబస్తులో పాల్గొన్నారు.