నంది ఎల్ల్లయ్య మృతిపై మండలి చైర్మన్‌ సంతాపం

ABN , First Publish Date - 2020-08-09T06:42:33+05:30 IST

పార్లమెంట్‌ మాజీ సభ్యుడు నంది ఎల్లయ్య మృతిపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో..

నంది ఎల్ల్లయ్య మృతిపై మండలి చైర్మన్‌ సంతాపం

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 8 : పార్లమెంట్‌ మాజీ సభ్యుడు నంది ఎల్లయ్య మృతిపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆరుసార్లు పార్లమెంట్‌సభ్యుడిగా, రెండుమార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న పరిచయం మరవలేనిదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-09T06:42:33+05:30 IST