ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే.. తెలుగు జాతిని అవమానించడమే: రామకృష్ణ
ABN , First Publish Date - 2022-01-03T20:26:46+05:30 IST
హైదరాబాద్: దుర్గి ఘటనను నందమూరి రామకృష్ణ ఖండించారు.
హైదరాబాద్: దుర్గి ఘటనను నందమూరి రామకృష్ణ ఖండించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే.. తెలుగు జాతిని అవమానించడమేనని అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఇక ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకునే వైసీపీ నేతలు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు.
కాగా దుర్గి ఘటనపై నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇంకా స్పందించలేదు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులుగా వారి స్పందన కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరే కాదు.. ఎన్టీఆర్ వీరాభిమానిగా చెప్పుకునే మోహన్ బాబులాంటి వాళ్లు కూడా ఈ ఘటనపై స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.