నమ్మకాన్ని నిలబెట్టారు

ABN , First Publish Date - 2021-10-19T03:36:31+05:30 IST

గత పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేసి నమ్మకాన్ని నిలబెట్టారని తిరుపతి, బాపట్ల వైసీపీ పరిశీలకుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి అన్నారు.

నమ్మకాన్ని నిలబెట్టారు
మాట్లాడుతున్న నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి

 నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి

కోట, అక్టోబరు 18 : గత పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేసి నమ్మకాన్ని నిలబెట్టారని తిరుపతి, బాపట్ల వైసీపీ పరిశీలకుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి అన్నారు.  విద్యానగర్‌లోని నేదురుమల్లి సుబ్బరామి రెడ్డి కళాభవన్‌లో సోమవారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, నేదురుమల్లి అభిమానులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా  పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు.  వైసీపీ సీఈసీసభ్యుడు కొడవలూరు ధనుంజయరెడ్డి, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేరిగ మురళి, వాకాడు  సింగిల్‌విండో చైర్మన్‌ కొడవలూరు భత్సవత్సల్‌రెడ్డి,  వేమారెడ్డి షనిల్‌రెడ్డి, దేవారెడ్డి నాగూర్‌రెడ్డి, పల్లెమల్లు విజయసారఽథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T03:36:31+05:30 IST