కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వినయ్‌భాస్కర్‌ నామినేషన్‌

ABN , First Publish Date - 2021-10-19T04:45:02+05:30 IST

కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వినయ్‌భాస్కర్‌ నామినేషన్‌

కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ వినయ్‌భాస్కర్‌ నామినేషన్‌
నామినేషన్‌ దాఖలు చేస్తున్న వినయ్‌భాస్కర్‌

హనుమకొండ టౌన్‌, అక్టోబరు 18 : టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉన్న దృష్ట్యా కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ పలువురు అధికార పార్టీ నేతలు నామినేషన్‌లు దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఎన్నికల అధికారి ఎం.శ్రీనివా్‌సరెడ్డికి చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ నామినేషన్‌ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. తాము కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. నవంబరులో వరంగల్‌లో జరిగే సభ కేసీఆర్‌ పట్ల ప్రజల విశ్వాసానికి సంకేతంగా ఉంటుందన్నారు. 

Updated Date - 2021-10-19T04:45:02+05:30 IST