కుమారపాళయంలో ఉత్సాహంగా జల్లికట్టు

ABN , First Publish Date - 2021-01-25T11:36:04+05:30 IST

నామక్కల్‌ జిల్లా కుమారపాళయంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ మోహన్‌రాజ్‌ నేతృత్వం లో...

కుమారపాళయంలో ఉత్సాహంగా జల్లికట్టు

చెన్నై/వాషర్‌మెన్‌పేట (ఆంధ్రజ్యోతి): నామక్కల్‌ జిల్లా కుమారపాళయంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ మోహన్‌రాజ్‌ నేతృత్వం లో జరిగిన ఈ పోటీలను మంత్రులు తంగమణి, సెంగోట్టయన్‌, కరుపన్నన్‌, డా.సి.విజయభాస్కర్‌ ప్రారం భించారు. కరోనా పరీక్షల అనం తరం క్రీడాకారులను పోటీలకు అనుమతించారు. 300 ఎద్దులు పాల్గొనగా, వాటిని అదుపుచేసేందుకు 500 మంది యువకులు పోటీపడ్డారు. ఆధ్యంతం రసవత్తంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలు, ఎద్దులకు మంత్రులు బహుమతులు అందజేశారు.

Updated Date - 2021-01-25T11:36:04+05:30 IST