రెండు మోటార్‌ బైక్‌లు ఢీ : నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-24T03:51:04+05:30 IST

ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌బైక్‌లు ఢీ కొనడంతో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం కాకొల్లువారిపల్లి గ్రా

రెండు మోటార్‌ బైక్‌లు ఢీ :   నలుగురికి గాయాలు
దెబ్బతిన్న మోటార్‌బైక్‌లు

వరికుంటపాడు, జూన్‌ 23: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌బైక్‌లు ఢీ కొనడంతో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం కాకొల్లువారిపల్లి గ్రామ సమీపంలో జరిగింది.  సేకరించిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరుకు చెందిన శ్రీను, తాడే బాలు, వింజమూరుకు చెందిన షేక్‌ ఖాజారహంతుల్లాలు పామూరు నుంచి మోటార్‌బైక్‌పై నర్రవాడకు వెళ్తున్నారు.  మరో మోటార్‌బైక్‌పై పామూరుకు చెందిన మన్నెం వెంకటేశ్వర్లు నర్రవాడ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఆ రెండు వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో గాయాలపాలైన నలుగురిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం పామూరుకు తరలించారు. కాగా తాడే బాలు పరిస్ధితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఒంగోలుకు తరలించారు. ఈ సంఘటనలో వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. 


-----

Updated Date - 2022-06-24T03:51:04+05:30 IST