నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-03-09T03:00:17+05:30 IST
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ర్యాబిస్ వ్యాధి సోకిన చిన్న శ్రీను ఫీవర్ ఆస్పత్రి ఏడో నెంబర్ వార్డులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.