Nallagonda: కిడ్నాప్కు గురైన వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-06-04T14:03:26+05:30 IST
జిల్లాలోని కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో దారుణం జరిగింది.
నల్గొండ: జిల్లాలోని కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం రాజశేఖర్(27) అనే యువకుడు కిడ్నాప్కు గురయ్యాడు. కాగా... రామచంద్రగూడెం శివారులో రాజశేఖర్ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితుడే హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాజశేఖర్ను హతమార్చినట్టు సమాచారం. హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.