Nallagonda: పెళ్లి వేడుకల్లో విషాదం
ABN , First Publish Date - 2022-05-27T13:24:59+05:30 IST
జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో అర్ధరాత్రి పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.
నల్గొండ: జిల్లాలోని చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో అర్ధరాత్రి పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బరాత్ తీస్తున్న వారిపైకి వధువు, వరుడు ఉన్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుబ్బాక సాయి చరణ్(13) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే పెళ్ళికొడుకు సహా పలువురికి గాయాలయ్యాయి. అయితే డ్రైవింగ్ రాకున్నప్పటికీ వరుడు కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.