Nallagonda మున్సిపాలిటీలో మొదలైన అరెస్ట్ల పర్వం
ABN , First Publish Date - 2021-09-14T13:41:35+05:30 IST
జిల్లా మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన ఉద్యోగుల కేసులో అరెస్టుల పర్వం మొదలైంది.
నల్లగొండ: జిల్లా మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన ఉద్యోగుల కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. 47 మంది సంబంధిత శాఖల ఉద్యోగులు 2010-14లో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, ఇంటి అనుమతులకు సంబంధించి దాదాపు రూ.5.04 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో 2015లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అవినీతి ఆరోపణల కేసుల పురోగతిలో భాగంగా ముగ్గురు ఉద్యోగులను నల్గొండ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో కొందరు ఉద్యోగులు సెలవుల్లో వెళ్ళిపోయారు.