Nallagonda: రైలు ఢీకొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

ABN , First Publish Date - 2022-06-21T15:02:10+05:30 IST

పట్టణంలోని చైతన్యపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన రమ్య అనే మహిళ ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీకొని మృతి చెందారు.

Nallagonda: రైలు ఢీకొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

నల్లగొండ: పట్టణంలోని చైతన్యపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన రమ్య అనే మహిళ ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీకొని మృతి చెందారు. గుంటూరు జిల్లాలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో రమ్య(28), ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక(6)లు దుర్మరణం చెందారు. వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను సత్తెనపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వీరి మృతిపై నల్లగొండలోని ఆమె భర్త, కుటుంబ సభ్యులకు తెల్లవారుజామున నడికుడ రైల్వే పోలీసులు సమాచారం అందించారు. కాగా... ఈ సంఘటన ప్రమాదమా? లేక... ఆత్మహత్య అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-21T15:02:10+05:30 IST