Nallagondaలో దారుణం..మహిళ కడుపులో దూది వదిలి కుట్లు వేసిన డాక్టర్లు

ABN , First Publish Date - 2022-05-08T18:15:11+05:30 IST

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జ్యోతి అనే మహిళకు డెలివరీ చేసి దూదిని

Nallagondaలో దారుణం..మహిళ కడుపులో దూది వదిలి కుట్లు వేసిన డాక్టర్లు

నల్లగొండ:  Central Government Hospitalలో డాక్టర్ల నిర్లక్ష్యం మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జ్యోతి అనే మహిళకు డెలివరీ చేసి దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. దూది కడుపులో ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజులపాటు నరకయాతన అనుభవించింది. ఈ విషయంపై బాధిత మహిళ బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్‎లను నిలదీశారు. బాధితురాలైన బంధువులకు డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇది ఇలావుండగా..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన గుంటి పద్మ(55) అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు సరిగ్గా చూడకపోవడంతో పద్మ పరిస్థితి విషమించి..చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక ప్రభుత్వ అంబులెన్స్ లోనైనా స్వగ్రామానికి తరలిస్తారనుకుంటే..అది కూడా మరమ్మత్తులు జరుగుతున్నాయని చెప్పారు. ఆస్పత్రిలో మరణించిన పద్మ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో దాతల సహాయంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్‎లోనే స్వగ్రామానికి తరలించారు. వైద్యం కూడా సరిగ్గా అందించలేదు.. చివరకు అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో స్థానికులు, మహిళ బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more