నల్లగొండలో జాతీయగీతాలాపన

ABN , First Publish Date - 2021-01-24T08:21:27+05:30 IST

జాతీయ గీతం జనగణమన... సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం నల్లగొండలో ప్రారంభించారు

నల్లగొండలో జాతీయగీతాలాపన

జాతీయ గీతం జనగణమన... సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని  శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి శనివారం నల్లగొండలో  ప్రారంభించారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  12 కూడళ్ల వద్ద మైక్‌సెట్లు ఏర్పాటు చేసి జాతీయ గీతాలాపన చేశారు. నేతాజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవితచరిత్రలను  విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.    

- నల్లగొండ కల్చరల్‌

Updated Date - 2021-01-24T08:21:27+05:30 IST