రోడ్డు ప్రమాదంలో తానేదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు మృతి

ABN , First Publish Date - 2021-09-01T13:18:47+05:30 IST

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త టీఆర్‌ఎస్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో తానేదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు మృతి

నల్లగొండ: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఎంపీటీసీ  దొంతం కవిత, ఆమె భర్త టీఆర్‌ఎస్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. ఓఆర్‌ఆర్ సమీపంలో దంపతులు ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మరణించారు. కవిత తిప్పర్తి మండలం తానేదార్‌పల్లిలో ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. వారం క్రితమే  దంపతులు తమ కూతురు వివాహం జరిపించారు. ఇంతలోనే వారు దుర్మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్వగ్రామమైన అనిశెట్టి దుప్పల పల్లి, నల్గొండలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2021-09-01T13:18:47+05:30 IST