మిర్యాలగూడలో దొంగల బీభత్సం..రూ. 8 లక్షలు అపహరణ

ABN , First Publish Date - 2021-02-27T18:08:46+05:30 IST

జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంతోష్‎నగర్‎లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి రూ. 8 లక్షల 50 వేల నగదు, మూడు తులాల బంగారు ...

మిర్యాలగూడలో దొంగల బీభత్సం..రూ. 8 లక్షలు అపహరణ

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంతోష్‎నగర్‎లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి రూ. 8 లక్షల 50 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్‎కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-27T18:08:46+05:30 IST