Tomorrow నల్లగొండ జిల్లాకు పవన్‌

ABN , First Publish Date - 2022-05-20T00:28:12+05:30 IST

ప్రమాదాల్లో ఆకస్మికంగా మృతి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Tomorrow నల్లగొండ జిల్లాకు పవన్‌

నల్లగొండ: ప్రమాదాల్లో ఆకస్మికంగా మృతి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి పర్యటన ప్రారంభం కానుంది. 10:30గంటలకు మెట్టుగూడ అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా 11గంటలకు ఎల్‌బీనగర్‌, 12:30గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ మృతిచెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకోనున్నారు.


ఇదే జిల్లాలోనే హుజూర్‌నగర్‌ మండలానికి చెందిన కడియం శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబాన్ని కోదాడలో పరామర్శించే ఏర్పాట్లు చేశారు. హుజూర్‌నగర్‌ వరకు వెళ్లాలంటే అభిమానులు, కార్యకర్తల రద్దీ, భద్రత ఏర్పాట్లలో ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోదాడ వరకే కార్యక్రమాన్ని పరిమితం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఈ రెండు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కును అందించనున్నారు. పవన్‌ పర్యటన నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో పవన్‌కల్యాణ్‌ కటౌట్లు, జనసేన జెండాలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-05-20T00:28:12+05:30 IST