Nagarjuna Sagar: 574.90 అడుగులకు చేరుకున్న ‘సాగర్’ నీటి మట్టం
ABN , First Publish Date - 2022-08-09T02:29:02+05:30 IST
నల్లగొండ జిల్లా (Nalgonda District) లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam)కు ఎగువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గింది.
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా (Nalgonda District) లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam)కు ఎగువ నుంచి వరద రాక స్వల్పంగా తగ్గింది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 574.90 అడుగులకు (268.8689 టీఎంసీలు) చేరింది. మరో 44 టీఎంసీల నీరు వచ్చి చేరితే సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంటుంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 2,236 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 2,608 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 30,640 క్యూసెక్కులు మొత్తంగా 35,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రెండు గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project)కు ఎగువ నుంచి 52,727 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో రెండు గేట్లను మీటరు ఎత్తి 21,100క్యూసెక్కులు, ప్రాజెక్టు పవర్ హౌస్లోని మూడు యూనిట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 70 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు)అడుగులు, కాగా ప్రస్తుతం 171.58 అడుగులుగా (40.63టీఎంసీలు) ఉంది.