నల్గొండ జిల్లా: చింతపల్లి మండలంలో దారుణం
ABN , First Publish Date - 2022-01-10T19:26:08+05:30 IST
నల్గొండ జిల్లా: చింతపల్లి మండలం, గొల్లపల్లి విరాట్ నగర్లో దారుణం చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా: చింతపల్లి మండలం, గొల్లపల్లి విరాట్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మెట్టు మహంకాళీ దేవాలయంలో అమ్మవారి కాళ్ల దగ్గర ఓ వ్యక్తి తల ఉండడం కలకలం సృష్టిస్తోంది. మొండెం వేరు చేసిన తలను గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఉంచి వెళ్లారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై మెట్టు మహంకాళి దేవాలయం ఉంది. ఈ పరిణామంతో స్థానికులు ఆందోళనకు గురౌతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.