నకిలీ విత్తనాలపై విచారణ

ABN , First Publish Date - 2022-06-26T03:02:49+05:30 IST

మండలంలోని వావిలేరు గ్రామానికి చెందిన ఓ రైతు తనకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మారని, దీంతో పంట దిగుబడి పూర్తిగా త

నకిలీ విత్తనాలపై విచారణ
పత్తి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

చేజర్ల, జూన్‌25: మండలంలోని వావిలేరు గ్రామానికి చెందిన ఓ రైతు తనకు నకిలీ పత్తి విత్తనాలు అమ్మారని,  దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందంటూ రెండు రోజుల క్రితం వ్యవసాయ అఽధికారులకు ఫిర్యాధు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు శనివారం జిల్లా వ్యవసాయ కార్యాలయం ఏడీఏ నర్సోజీరావు, పొదలకూరు వ్యవసాయశాఖ ఏడీఏ నాగేశ్వరరావు పత్తి పంటను పరిశీలించారు. అనంతరం  కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. రైతుకు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని, ఆ విత్తనాలు నకిలీవని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శశిధర్‌, ఏఈవో  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T03:02:49+05:30 IST