TS News: నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు..

ABN , First Publish Date - 2022-09-25T17:06:00+05:30 IST

డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

TS News: నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు..

వరంగల్ (Warangal): డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పోస్టుల నియామకంలో భారీ కుంభకోణం (Scam) జరిగిందని ఆరోపించారు. 452 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఈ స్కాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లకు భాగస్వామ్యం ఉందని విమర్శించారు. ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆధారాలున్నాయన్నారు. ఈస్కాంపై విచారణ జరపాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-09-25T17:06:00+05:30 IST