నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు: ఈటల
ABN , First Publish Date - 2020-10-18T03:12:11+05:30 IST
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి ఈటల రాజేందర్, కర్నె ప్రభాకర్ పరామర్శించారు. నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. ఇటీవల నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి ఈటల రాజేందర్, కర్నె ప్రభాకర్ పరామర్శించారు. నాయినికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. ఇటీవల నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం నాయికి కరోనా సోకింది. చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. అయితే కరోనా కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో నాయిని మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. నాయిని సతీమణికి పెద్ద కుమారుడుకు, అల్లుడు శ్రీనివాస్రెడ్డికి కూడా సోకింది. అయితే కుమారుడు, అల్లుడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. నాయిని సతీమణి మాత్రం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.