యాదాద్రి క్షేత్రంలో వైభవంగా నాగులచవితి

ABN , First Publish Date - 2021-08-14T01:13:32+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో శుక్రవారం నాగులపంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయం మొదటి ఘాట్‌ రోడ్డులోని

యాదాద్రి క్షేత్రంలో వైభవంగా నాగులచవితి

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో శుక్రవారం నాగులపంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయం మొదటి ఘాట్‌ రోడ్డులోని పుట్ట వద్ద భక్తులు నాగేంద్రుడిని కొలుస్తూ అభిషేకం, అర్చనలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని నరసింహుడి సన్నిధిలో లక్ష్మీపూజలు ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో కవచమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీదళాలు, కుంకుమతో పూజలు చేశారు. సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంజల్‌ సేవోత్సవం సంప్రదాయరీతిలో నిర్వహించారు. పాతగోశాల డార్మిటరీ హాల్‌లో ప్రారంభమైన సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-14T01:13:32+05:30 IST