మౌలిక వసతుల్లేని పరీక్ష కేంద్రాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-10-24T11:23:05+05:30 IST
ఈనెల 26 నుంచి నవంబరు నెల 13వ తేదీ వరకు జరిగే ఆచా ర్య నాగార్జున యూనివర్శిటీ ఓపెన్ డిగ్రీ, పీజీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతుల్లేని కేం ద్రాలను రద్దు చేయాలని..
ప్రొద్దుటూరు రూరల్, అక్టోబరు 23: ఈనెల 26 నుంచి నవంబరు నెల 13వ తేదీ వరకు జరిగే ఆచా ర్య నాగార్జున యూనివర్శిటీ ఓపెన్ డిగ్రీ, పీజీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతుల్లేని కేం ద్రాలను రద్దు చేయాలని ఏఐఎ్సఎఫ్ లాస్టూడెంట్స్ వింగ్ నాయకుడు నాగరాజు డిమాండ్ చేశా రు. ఈమేరకు ఆయన శుక్రవారం తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు నజీర్ అహమ్మద్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేట్ కోఆర్డినేటర్ కోవిడ్ నిబంధన లు దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పరిశీలనలు చేయకుండా ఇష్టానుసారంగా పరీక్ష కేంద్రాలను కేటాయించారన్నారు. పరీక్ష కేంద్రానికి కనీస సౌర్యాలతోపాటు కూర్చోవడానికి బెంచీలు, తాగడానికి నీరు లేవన్నారు. దీనిపై స్పందించిన తహసీల్దారు సమస్యను తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎ్సఎఫ్ నాయకులు వినోద్, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.